Thu Jan 29 2026 00:10:24 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిలో ఉద్రిక్తత
రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం ఉండటంతో పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. రైతుల నిరసనలనకు కూడా పోలీసులు నో [more]
రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం ఉండటంతో పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. రైతుల నిరసనలనకు కూడా పోలీసులు నో [more]

రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం ఉండటంతో పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. రైతుల నిరసనలనకు కూడా పోలీసులు నో చెప్పారు. సచివాలయానికి వెళ్లే దారి మొత్తం పోలీసులతో నిండిపోయి ఉంది. కరకట్ట, సీడ్ యాక్సిస్ రోడ్డు, వెలగపూడి రహదారిలో పోలీసులు పెద్దయెత్తున చేరుకున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు నిర్మించారు. తాము రాజధాని కోసం భూములిస్తే తమపై ఈ ఆకాంక్షలేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. మందడం, మల్కాపురంలో ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మొహరించారు.
Next Story

