Sun Mar 15 2026 09:23:11 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతలు ఎక్కడికక్కడే.. వాటిపై ఫోకస్
తెలుగుదేశం పార్టీ నేతలు క్రమంగా ప్రాంతాలు, జిల్లాల వారీగా సమస్యలపై దృష్టి పెట్టారు. తమ ప్రాంత సమస్యలను హైలెట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి నిర్లక్ష్యంపై నిన్న విశాఖలో [more]
తెలుగుదేశం పార్టీ నేతలు క్రమంగా ప్రాంతాలు, జిల్లాల వారీగా సమస్యలపై దృష్టి పెట్టారు. తమ ప్రాంత సమస్యలను హైలెట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి నిర్లక్ష్యంపై నిన్న విశాఖలో [more]

తెలుగుదేశం పార్టీ నేతలు క్రమంగా ప్రాంతాలు, జిల్లాల వారీగా సమస్యలపై దృష్టి పెట్టారు. తమ ప్రాంత సమస్యలను హైలెట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి నిర్లక్ష్యంపై నిన్న విశాఖలో టీడీపీ నేతలు సమావేశం జరిపారు. రాయలసీమ ప్రాజెక్టుల పురోగతిపై రేపు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ లో చేర్చకపోవడంపై జలశక్తి మంత్రి ని కలవనున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా టీడీపీ నేతలు లేఖ రాశారు.
Next Story

