Sat Dec 06 2025 01:18:58 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే ఎన్నికను బహిష్కరించాలంటున్న టీడీపీ
త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధికార పార్టీ అరాచకాలకు ఈ ఎన్నికల్లోనూ అడ్డూ అదుపూ లేకుండా పోతుందని [more]
త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధికార పార్టీ అరాచకాలకు ఈ ఎన్నికల్లోనూ అడ్డూ అదుపూ లేకుండా పోతుందని [more]

త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధికార పార్టీ అరాచకాలకు ఈ ఎన్నికల్లోనూ అడ్డూ అదుపూ లేకుండా పోతుందని భావించిన తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడే చెలరేగిపోయిన వైసీపీ, నీలం సాహ్ని వచ్చిన తర్వాత మరిన్ని బెదిరింపులకు దిగుతుందని తెలుగుదేశం అభిప్రాయపడుతుంది. షెడ్యూల్ విడుదలయిన వెంటనే దీనిపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.
Next Story

