Sun Feb 01 2026 08:11:51 GMT+0000 (Coordinated Universal Time)
బాబు కీలక నిర్ణయం....ముఖ్యమంత్రి అయ్యాకే మళ్లీ సభలో అడుగు పెడతా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభలోకి అడుగు పెడతానని ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. తన భార్య విషయాన్ని కూడా సభలో ప్రస్తావించారని చంద్రబాబు అన్నారు. తాను ఎన్నో అవమానాలను ప్రజల కోసం భరించానన్నారు. అనరాని మాటలు అంటున్నా తనాు భరించానని చెప్పారు.
ఎమ్మెల్యేలతో సహా....
గత రెండున్నరేళ్లుగా తాను అనుభవిస్తున్న బాధను ఈరోజు బయటకు చెప్పుకున్నానని చంద్రబాబు తెలిపారు. ఈ సభలో ఇక అడుగుపెట్టడానికి కూడా ఇష్టం లేదన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తాను సభలోకి వస్తానని టీడీపీ ఎమ్మెల్యేలతో సహా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
- Tags
- chandra babu
- tdp
Next Story

