Wed Jan 28 2026 22:42:36 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 28న టీడీపీ ఆందోళన
పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా ఈ నెల 28 వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించనంది. పెట్రోలు ధరలు ఏ రాష్ట్రంలో లేని విధంగా [more]
పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా ఈ నెల 28 వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించనంది. పెట్రోలు ధరలు ఏ రాష్ట్రంలో లేని విధంగా [more]

పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా ఈ నెల 28 వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించనంది. పెట్రోలు ధరలు ఏ రాష్ట్రంలో లేని విధంగా పెరిగిపోయాయని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నులు పెంచడం వల్లనే ఇది జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు పై 31 శాతం, డీజిల్ పై 20 శాతానికి వ్యాట్ ను పెంచారని వారంటున్నారు. దీనిపై తాము ఈ నెల 28వ తేదీన నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.
Next Story

