Wed Dec 10 2025 03:55:12 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల వేళ టీడీపీకి షాక్.. మరోనేత వైసీపీలోకి
కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వైసీపీలో చేరారు. ఆయన 1995లో కర్నూలు మేయర్ గా [more]
కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వైసీపీలో చేరారు. ఆయన 1995లో కర్నూలు మేయర్ గా [more]

కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వైసీపీలో చేరారు. ఆయన 1995లో కర్నూలు మేయర్ గా చేశారు. అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. బంగి అనంతయ్య వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. తెలుగుదేశం పార్టీ తనను పట్టించుకోవడం లేదని, జగన్ సంక్షేమ పథకాలు నచ్చే తాను వైసీపీలో చేరారని బంగి అనంతయ్య తెలిపారు.
Next Story

