Sat Dec 06 2025 01:12:04 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ
చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ప్రతిపక్ష [more]
చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ప్రతిపక్ష [more]

చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ప్రతిపక్ష నేతకు పూర్తి రక్షణను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని వారు పేర్కొన్నారు. చంద్రబాబు అంటేనే ప్రభుత్వం భయపడుతుందని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. మంత్రులు రౌడీల్లాగా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య అన్నారు. చంద్రబాబు పై దాడి చేసిందే కాకుండా తిరిగి తమపై నిందలను మోపుతున్నారన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వం బాద్యతారహితంగా వ్యవహరిస్తుందని వర్ల రామయ్య పేర్కొన్నారు.
Next Story

