Thu Jan 29 2026 14:50:59 GMT+0000 (Coordinated Universal Time)
విధుల్లో తీసుకోకుంటే ఆందోళన తప్పదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. జగన్ వల్లనే కరోనా వ్యాప్తి ఎక్కువయిందని ఆయన విమర్శించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. జగన్ వల్లనే కరోనా వ్యాప్తి ఎక్కువయిందని ఆయన విమర్శించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. జగన్ వల్లనే కరోనా వ్యాప్తి ఎక్కువయిందని ఆయన విమర్శించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను ఎందుకు విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందో చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఉన్న సమయంలో వారిని తొలగించడమేంటని ప్రశ్నించారు. కరోనా కేసులు పెరిగితే వారికి ఆసుపత్రుల్లో ఎవరు చికత్స చేస్తారని పట్టాభి ప్రశ్నించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ను విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళనకు దిగుతామని పట్టాభి హెచ్చరించారు.
Next Story

