Mon Mar 17 2025 15:08:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కుటుంబరావుకు ఝలక్
విజయవాడ భానునగర్ లో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సలహాదారుగా ఉన్న కుటుంబరావు తనదే స్థలమంటూ ఈ [more]
విజయవాడ భానునగర్ లో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సలహాదారుగా ఉన్న కుటుంబరావు తనదే స్థలమంటూ ఈ [more]

విజయవాడ భానునగర్ లో 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సలహాదారుగా ఉన్న కుటుంబరావు తనదే స్థలమంటూ ఈ భూమి చుట్టూ ప్రహరీని నిర్మించారు. కోట్ల రూపాయలు విలువచేసే భూమి కావడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. తమ పూర్వీకుల భూమిని కోర్టు నుండి పొందామని కుటుంబరావు సంబంధీకులు చెబుతున్నారు. ఇది మొత్తం సీలింగ్ భూమి అని సబ్ కలెక్టర్ అంటున్నారు. స్థలంలో ఉన్న షెడ్డును ప్రభుత్వ సిబ్బంది తొలగిస్తున్నారు.
Next Story