Fri Jan 30 2026 13:04:59 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు టీడీపీ షాక్
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు పార్టీ షాక్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి [more]
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు పార్టీ షాక్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి [more]

తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు పార్టీ షాక్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేయాలని విప్ జారీ చేసింది. టీడీపీ గుర్తు మీద గెలిచిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలిగిరిలు వైసీపీకి మద్దతిచ్చారు. అధికారికంగా వీరు టీడీపీలో ఉన్నట్లే. అందుకే టీడీపీ విప్ జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యకు ఓటు వేయాలని, పార్టీ విప్ ను థిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
Next Story

