Mon May 06 2024 16:03:46 GMT+0000 (Coordinated Universal Time)
దివాకరా.... ఇదేమి ట్విస్ట్...?
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితలు వేరని, ప్రస్తుత పరిస్థితులు వేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు ఉండాలని కోరుకుంటోందని, అక్కడ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే తప్పేమీ లేదని ఆయన తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు మంచిది కాదని పేర్కొన్నారు. బీజేపీని ఇప్పటివరకు నమ్మామని, కాంగ్రెస్ అధికారంలోకి వపస్తే ఏపీకి న్యాయం చేస్తామని అంటున్నందున కాంగ్రెస్ ని నమ్మితే తప్పేమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకున్నా ఏపీ ప్రజలు హర్షిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story