Sun Apr 28 2024 20:15:42 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో సీమలో నీటి కోసం ఉద్యమం
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కలుసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా నీలకంఠాపురం వెళ్లి మరీ కలిశారు. ఆయన [more]
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కలుసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా నీలకంఠాపురం వెళ్లి మరీ కలిశారు. ఆయన [more]
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కలుసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా నీలకంఠాపురం వెళ్లి మరీ కలిశారు. ఆయన గ్రామంలో నిర్మించిన దేవాలయాలను జేసీ ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. రాయలసీమలో నీటి సమస్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా సీమలో నీటి ఎద్దడి నివారణకు ప్రతి ఒక్కరిని కలసి ఆలోచనలను పంచుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. త్వరలో దీనిపై పార్టీలకతీతతంగా ఉద్యమం చేస్తామని తెలిపారు.
Next Story