Fri Jan 30 2026 15:54:27 GMT+0000 (Coordinated Universal Time)
రమణదీక్షితుల కంటే ముందుగానే...?

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా ముదురుతున్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుమల నూతన ప్రధాన అర్చకులుగా నియమితులైన వేణుగోపాల దీక్షితులే మొదట సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైన కోర్టుకి వస్తే తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరుతూ వేణుగోపాల దీక్షతులు తరపు న్యాయవాది కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే, తనను ప్రధాన అర్చకులుగా తొలగించిడంపై వచ్చే నెల సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రమణ దీక్షితులు చెప్పగా, ఆయన కంటే ముందే వేణుగోపాల దీక్షితులు కోర్టు గడప తొక్కారు.
Next Story

