Tue Jan 20 2026 18:28:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రేపు మధ్యప్రదేశ్ లో బలపరీక్ష
రేపు మధ్యప్రదేశ్ లో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. [more]
రేపు మధ్యప్రదేశ్ లో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. [more]

రేపు మధ్యప్రదేశ్ లో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే దీనిపై బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమల్ నాధ్ ప్రభుత్వం బలపరీక్షను నిర్వహించడం లేదని, వెంటనే జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు రేపు మధ్యప్రదేశ్ లో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో కమల్ నాద్ ప్రభుత్వం రేపు బలపరీక్షను నిర్వహించాల్సి ఉంది. చేతులెత్తే పద్ధతిలో బలపరీక్ష నిర్వహించాలని సూచించింది.
Next Story

