Sun Mar 15 2026 19:02:50 GMT+0530 (India Standard Time)
పెట్టుబడిదారులు పారిపోతున్నారు
ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడిదారులు పారిపోతున్నారని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగులు రాజ్యాంగానికి విరుద్ధమని సుజనాచౌదరి చెప్పారు. పోలవరం కాంట్రాక్టర్ ఎవరు [more]
ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడిదారులు పారిపోతున్నారని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగులు రాజ్యాంగానికి విరుద్ధమని సుజనాచౌదరి చెప్పారు. పోలవరం కాంట్రాక్టర్ ఎవరు [more]

ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడిదారులు పారిపోతున్నారని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగులు రాజ్యాంగానికి విరుద్ధమని సుజనాచౌదరి చెప్పారు. పోలవరం కాంట్రాక్టర్ ఎవరు అని చూడకదని, పనులు కావడమే ముఖ్యమని ప్రభుత్వం భావించాల్సిందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టర్ ను మారిస్తే ఆ ప్రభావం పనులపై పడుతుందన్నారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చని, ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించదని ఆయన అన్నారు. మంచి మెజారిటీతో గెలిచిన వైసీపీ సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు ప్రగతికి అవరోధగాలుగా మారాయన్నారు.
Next Story

