Thu Jan 29 2026 13:08:18 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలంలో క్షుద్రపూజలు..?
ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి పూజలు జరగడం సంచలనంగా మారింది. అమ్మవారి గుడి అర్చకుడు గంటి రాధాకృష్ణ సంప్రదాయాలు, నియమాలకు విరుద్ధంగా అర్థరాత్రి వేళ [more]
ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి పూజలు జరగడం సంచలనంగా మారింది. అమ్మవారి గుడి అర్చకుడు గంటి రాధాకృష్ణ సంప్రదాయాలు, నియమాలకు విరుద్ధంగా అర్థరాత్రి వేళ [more]

ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి పూజలు జరగడం సంచలనంగా మారింది. అమ్మవారి గుడి అర్చకుడు గంటి రాధాకృష్ణ సంప్రదాయాలు, నియమాలకు విరుద్ధంగా అర్థరాత్రి వేళ అమ్మవారి ఆలయంలో హోమం నిర్వహించారు. ఈ తతంగాన్ని ఆలయ ఉద్యోగాలే చాటుగా వీడియో తీయడంతో కలకలం రేపాయి. ఎటువంటి అనుమతులు లేకుండా హోమం ఎందుకు నిర్వహించాడు..? అర్థరాత్రి వేళ హోం జరపడానికి కారణాలు తెలియడం లేదు. హోమం నిర్వహించిన అర్చకుడు రాధాకృష్ణను సస్పెండ్ చేస్తూ ఈవో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు కూడా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు జరిగాయని ఆరోపణలు వచ్చిన విషయం విధితమే.
Next Story
