Mon Dec 08 2025 09:33:58 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు… ఈ ఒక్కరోజే?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 2, [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 2, [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 2, 16,919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 9,304 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. 260 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6,075కు చేరుకుంది. ఇప్పటి వరకూ 1,04,106 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు భారత్ లో 1,06,737 ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
Next Story

