Sun Feb 01 2026 21:02:25 GMT+0000 (Coordinated Universal Time)
వీళ్లకు ప్రజలపై సానుభూతి కూడా లేదు
పాలకులకు ప్రజల పట్ల సానుభూతి అనేది లేకుండా పోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. సెకండ్ వేవ్ లో ప్రభుత్వం ప్రజలను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందన్నారు. [more]
పాలకులకు ప్రజల పట్ల సానుభూతి అనేది లేకుండా పోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. సెకండ్ వేవ్ లో ప్రభుత్వం ప్రజలను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందన్నారు. [more]

పాలకులకు ప్రజల పట్ల సానుభూతి అనేది లేకుండా పోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. సెకండ్ వేవ్ లో ప్రభుత్వం ప్రజలను పూర్తిగా పట్టించుకోవడం మానేసిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని సోనియా గాంధీ ఆరోపించారు. సోనియా గాంధీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై సానుభూతి కొరవడటం వల్లనే దేశంలో ఈ దుస్థితి నెలకొని ఉందని సోనియా గాంధీ అన్నారు. కోవిడ్ పై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story

