Thu Mar 19 2026 10:58:47 GMT+0530 (India Standard Time)
టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదెందుకు?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్ల మరమ్మత్తులకు టెండర్లు పిలిస్తే ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు [more]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్ల మరమ్మత్తులకు టెండర్లు పిలిస్తే ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు [more]

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్ల మరమ్మత్తులకు టెండర్లు పిలిస్తే ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాలేదన్నారు. ఇది ప్రభుత్వ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. పనులు చేసినా బిల్లులు రావని భయపడి కాంట్రాక్టర్లు ఎవరూ రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని సోము వీర్రాజు తెలిపారు. అప్పులతోనే ఏపీలో పాలన జరుగుతుందన్నారు. అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని సోము వీర్రాజు తెలిపారు.
Next Story

