Thu Jan 29 2026 09:08:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇక ప్రాజెక్టులకు వెళ్లాలంటే వారి అనుమతితోనే?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీనిపై ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల [more]
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీనిపై ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల [more]

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీనిపై ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు, స్నేహాలు సజీవంగా ఉన్నాయన్నారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల మూర్ఖత్వంతోనే కేంద్ర ప్రభుత్వం నీళ్ల పెత్తనాన్ని చేజిక్కించుకుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలంటే సీఐఎస్ఎఫ్ ల బలగాల అనుమతి కావాల్సిన దుస్థితి ఏర్పడిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story

