Fri Jan 30 2026 19:13:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వైసీపీకి టచ్ లోకి వెళ్లిన మాజీ మంత్రి
మాజీ మంత్రి శిద్ధారాఘవరావు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. శిద్ధారాఘవరావు ప్రస్తుతం దర్శి టీడీపీ [more]
మాజీ మంత్రి శిద్ధారాఘవరావు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. శిద్ధారాఘవరావు ప్రస్తుతం దర్శి టీడీపీ [more]

మాజీ మంత్రి శిద్ధారాఘవరావు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. శిద్ధారాఘవరావు ప్రస్తుతం దర్శి టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. శిద్ధారాఘవరావు ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ లో చేరతారన్న ప్రచారం జరిగింది. ఇటీవల శిద్ధా రాఘవరావుకు చెందిన గ్రానైట్ కంపెనీలపై విజిలెన్స్ దాడులు జరిగాయి. వందల కోట్ల జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో శిద్ధా రాఘవరావు కూడా వైసీపీలో చేరిపోతారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు.
Next Story

