Thu Feb 05 2026 06:41:33 GMT+0000 (Coordinated Universal Time)
మేం మూసివేయాలని చెప్పామా?
అమరరాజా బ్యాటరీస్ ను మూసివేయాలని ప్రభుత్వం చెప్పలేదని, పర్యావరణానికి ముప్పులేకుండా చూడాలని మాత్రమే కోరామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మొత్తం 64 కంపెనీలకు నోటీసులు [more]
అమరరాజా బ్యాటరీస్ ను మూసివేయాలని ప్రభుత్వం చెప్పలేదని, పర్యావరణానికి ముప్పులేకుండా చూడాలని మాత్రమే కోరామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మొత్తం 64 కంపెనీలకు నోటీసులు [more]

అమరరాజా బ్యాటరీస్ ను మూసివేయాలని ప్రభుత్వం చెప్పలేదని, పర్యావరణానికి ముప్పులేకుండా చూడాలని మాత్రమే కోరామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మొత్తం 64 కంపెనీలకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని భావించే నోటీసులు ఇవ్వడం జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిని రాజకీయం చేయడానికి చూస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పులేకుండా ఫ్యాక్టరీలు నడిపితే ఎవరికీ అభ్యంతరం ఉండబోదన్నారు. పరిశ్రమలను పోగొట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story
