Sat May 04 2024 12:46:14 GMT+0000 (Coordinated Universal Time)
అతడు రాముడైతే...నేను హనుమంతుడిని
క్రికెట్ ఆడినన్ని రోజులూ బ్యాట్ తో పరుగుల వరద పారించి అభిమానులను విశేషంగా అలరించాడు డేరింగ్ ఆండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో ఆడుకుంటున్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే సెహ్వాగ్ అనేక విషయాలపై తనదైన శైలిలో పోస్టులు చేస్తుంటాడు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తో కలిసి తాను దిగిన ఫోటోని వీరూ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సచిన్ ను తన దేవుడితో పోల్చే సెహ్వాగ్ ఆ ఫోటోలో సచిన్ నిలబడి ఉండగా, సెహ్వాగ్ గద లాగా ఓ వస్తువుల పట్టుకుని కింద కూర్చున్నాడు. ఈ ఫోటోను ‘దేవుడితో ఉన్నప్పుడు...అతని పాదాల వద్ద ఉండటం బాగుంది’ అని పోస్ట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాతో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ ఫోటోకు ఫిదా అయిపోయారు.
Next Story