Fri Dec 05 2025 11:09:33 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలు ఐదుగురిపై వేటు వేసిన రోజా
పంచాయతీ ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా వేటు వేశారు. వైసీపీకి చెందిన ఐదుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు [more]
పంచాయతీ ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా వేటు వేశారు. వైసీపీకి చెందిన ఐదుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు [more]

పంచాయతీ ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా వేటు వేశారు. వైసీపీకి చెందిన ఐదుగురు నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రోజా ప్రకటించారు. వారికి ఇక పార్టీతో ఏమాత్రం సంబంధంలేదని, క్యాడర్ కూడా గుర్తుంచుకోవాలని ఆర్కే రోజా తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులకు వ్యతిరేకంగా కొందరిని బరిలోకి దింపడం, వ్యతిరేకంగా పనిచేయడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు.
Next Story

