Fri May 03 2024 00:15:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి షాక్...?
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి స్క్రీనింగ్ కమిటీ షాకిచ్చింది. రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలనలోకి తీసుకోలేదు. వేం నరేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సీటును ఆశించారు. అయతే వేం నరేందర్ రెడ్డి పేరును పరిశీలించకుండా నాయని రాజేందర్ రెడ్డి ఒక్క పేరుతోనే స్క్రీనింగ్ కమిటీ అధిష్టానానికి జాబితా పంపింది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరిన మరో కీలక నేత సీతక్క ములుగు నియోజకవర్గం సీటును ఆశించారు. అయితే సీతక్కను భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయపడింది. దీంతో రేవంత్ తన అనుచరులతో కలసి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
Next Story