Fri May 03 2024 12:38:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అలిగి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి..?
తెలంగాణ కాంగ్రెస్ లో మరో కొత్త కుమ్ములాట రేగినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి... తనతో కలిసి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, అందరికీ సీట్లు ఇవ్వలేమని నేతలు చెబుతున్నారు. సమావేశం మధ్యలోనే రేవంత్ రెడ్డి బయటకు వచ్చేశారు. టిక్కెట్ల కేటాయింపులో తన వర్గానికి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి అలిగి బయటకు వచ్చారని తెలుస్తోంది. అయితే, సెక్యూరిటీకి సంబంధించి తనకు హోంమంత్రి అపాయింట్ మెంట్ ఉన్నందునే సమావేశం నుంచి బయటకు వచ్చానని రేవంత్ అంటున్నారు.
Next Story