Tue May 07 2024 15:45:28 GMT+0000 (Coordinated Universal Time)
భూముల అమ్మకాల్లో గోల్ మాల్.. రేవంత్ ఆరోపణలు
భూముల అమ్మకాల్లో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనకు అనుకూలమైన వారికే వేలంలో భూములు దక్కడం వెనక అర్థమేంటని ప్రశ్నించారు. భూముల [more]
భూముల అమ్మకాల్లో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనకు అనుకూలమైన వారికే వేలంలో భూములు దక్కడం వెనక అర్థమేంటని ప్రశ్నించారు. భూముల [more]
భూముల అమ్మకాల్లో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తనకు అనుకూలమైన వారికే వేలంలో భూములు దక్కడం వెనక అర్థమేంటని ప్రశ్నించారు. భూముల అమ్మకాల గోల్ మాల్ పై పార్లమెంటులో లేవెనెత్తుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చెందిన కంపెనీ ఈ భూములను దక్కించుకుందన్నారు. వేలంలో ఎవరూ పాల్గొనకుండా సిద్దిపేట కలెక్టర్ బెదిరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమేష్ కుమార్ కు పదోన్నతి కల్పించడంపై కూడా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సోమేష్ కుమార్ కు ఆదాయం వచ్చే అన్ని శాఖలను అప్పగించడాన్ని రేవంత్ ప్రశ్నించారు.
Next Story