Fri Dec 19 2025 02:17:21 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాకు రేవంత్ రెడ్డి లేఖ.. తనకు ప్రాణహాని ఉందంటూ
ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వంపై [more]
ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వంపై [more]

ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వంపై తాను పోరాటం చేస్తున్నందున తనకు ప్రాణహాని ఉందని ఆయన రాసిన లేఖలో తెలిపారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు భద్రత పెంచాలని గతంలోనూ కోరానని, అయితే ప్రభుత్వం మాత్రం తనకు భద్రత కల్పించలేదన్నారు. తనకు భద్రతను మరింత పెంచాలని రేవంత్ రెడ్డి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story

