తిరుపతి ఫలితాన్ని ఆపండి.. కోర్టులో రత్న ప్రభ పిటీషన్
తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేయాలంటూ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీన తిరుపతి [more]
తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేయాలంటూ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీన తిరుపతి [more]
తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేయాలంటూ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీన తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు పోలయ్యాయని విపక్షాలు ఆరోపించాయి. ఉప ఎన్నికను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. అయితే ఉప ఎన్నిక రద్దు కాకపోవడంతో రత్న ప్రభ ఫలితాలను నిలుపుదల చేయాలని హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఎన్నికల కమిషన్ తో పాటు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మితో సహా 32 మందిని తన పిటీషన్ లో రత్న ప్రభ చేర్చారు. ఈ పిటీషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.