Mon Mar 16 2026 02:45:25 GMT+0530 (India Standard Time)
జగన్ పై ప్రశంసలు కురిపించిన జనసేన ఎమ్మెల్యే
జగన్ ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. జగన్ పాలనలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. పింఛన్ల మీద మాట్లాడే హక్కు ఒక్క వైఎస్ కుటుంబానికే [more]
జగన్ ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. జగన్ పాలనలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. పింఛన్ల మీద మాట్లాడే హక్కు ఒక్క వైఎస్ కుటుంబానికే [more]

జగన్ ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. జగన్ పాలనలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. పింఛన్ల మీద మాట్లాడే హక్కు ఒక్క వైఎస్ కుటుంబానికే ఉందన్నారు. తండ్రి బాటలోనే జగన్ కూడా పయనిస్తుండటం సంతోషమన్నారు. పేదల అవసరాలకు అనుగుణంగా జగన్ పాలన చేస్తున్నారని రాపాక వరప్రసాద్ కితాబు ఇచ్చారు. గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. చంద్రబాబుకు పింఛన్ల మీద మాట్లాడే అర్హత లేదన్నారు. తాను వేరే పార్టీ సభ్యుడినయినా మంచిని గుర్తు చేయడం తన కర్తవ్యమని రాపాక వరప్రసాద్ చెప్పారు.
Next Story

