Thu Jan 29 2026 15:07:02 GMT+0000 (Coordinated Universal Time)
ప్రతిసారీ ప్రజలు నమ్మరు
ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామాలకు సిద్ధమని, అందుకు వైసీపీ ఎంపీలు సిద్ధపడతారా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు. ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు [more]
ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామాలకు సిద్ధమని, అందుకు వైసీపీ ఎంపీలు సిద్ధపడతారా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు. ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు [more]

ప్రత్యేక హోదా కోసం తాము రాజీనామాలకు సిద్ధమని, అందుకు వైసీపీ ఎంపీలు సిద్ధపడతారా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు. ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని నాడు జగన్ చెప్పారని, ఇప్పుడు తాము సిద్ధమని, వైసీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై జగన్ ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలు ప్రతిసారీ నమ్మరన్న విషయాన్ని వైసీపీ అధినేత గుర్తుంచుకోవాలని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు.
Next Story

