Sat Dec 06 2025 20:58:34 GMT+0000 (Coordinated Universal Time)
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిందే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్ కు లేఖ రాశారు. కృష్ణానది [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్ కు లేఖ రాశారు. కృష్ణానది [more]

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్ కు లేఖ రాశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని ఖరారు చేస్తూ ఈ నెల 15 వతేదీన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఏపీకి 811 టీఎంసీల నీరు కేటాయించింది. విభజన తర్వాత 512 టీఎంసీలకు మారింది. దీనివల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నష్టం జరిగే అవకాశముందని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై లాభనష్టాలను అన్ని పార్టీలతో చర్చించాలని రామకృష్ణ జగన్ ను డిమాండ్ చేశారు.
Next Story

