Sat Dec 06 2025 02:28:53 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభలోనే ఉండిపోయిన టీడీపీ ఎంపీలు

రాజ్యసభలో టీడీపీ ఎంపీల నిరసనను కొనసాగిస్తున్నారు. సభ వాయిదా పడినా రాజ్యసభలోనే ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్షల్స్, రాజ్యసభ అధికారులు ఎంపీలను బయటకు వెళ్లాల్సిందిగా కోరుతున్నా విన్పించుకోవడం లేదు. తాము వెళ్లేది లేదని టీడీపీ రాజ్యసభ సభ్యులు నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ విభజన హామీలు అమలు చేయాల్సిందేనంటూ అక్కడే ఉండి నినాదాలు చేస్తూనే ఉన్నారు.
Next Story
