Sun Apr 28 2024 16:01:42 GMT+0000 (Coordinated Universal Time)
కోర్టులో రాహుల్
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన వ్యాఖ్యలే ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గతంలో ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మంగళవారం ముంబైలోని భీవండి కోర్టుకు రాహుల్ హాజరయ్యారు. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ హస్తముందంటూ రాహుల్ గతంలో వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యాలను సీరియస్ గా తీసుకున్న ఆర్ఎస్ఎస్ రాహుల్ పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో ఆయన కోర్టుకు హాజరై తన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సి వచ్చింది.
Next Story