Wed Mar 25 2026 03:30:41 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదు?

తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయడంలేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు బహిరంగ రహస్యమేనన్నారు. కానీ వైసీపీ రహస్య ఒప్పందాలు, చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ తో 18 పార్టీలు కలసి ప్రయాణం సాగిస్తున్నాయని తెలిపారు. జగన్ పార్టీ తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఏపీలో పొత్తుపై ఇంకా ఒక స్పష్టత రాలేదన్నారు. ఎన్నికలకు సమయం ఉన్నందున పొత్తుల విషయం ఇప్పుడే చర్చించడం అనవసరమని రఘువీరా అభిప్రాయపడ్డారు.
- Tags
- andhra pradesh
- ap politics
- indian national congress
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- raghuveera reddy
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- రఘువీరారెడ్డి
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

