Fri Dec 05 2025 20:17:32 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు
విశాఖ ప్రజలూ రాజధానిని కోరుకోవడం లేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. అమరావతిలో మాత్రం అక్కడ ప్రజలు రాజధానిని కొనసాగించాలని కోరుతున్నారన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు [more]
విశాఖ ప్రజలూ రాజధానిని కోరుకోవడం లేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. అమరావతిలో మాత్రం అక్కడ ప్రజలు రాజధానిని కొనసాగించాలని కోరుతున్నారన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు [more]

విశాఖ ప్రజలూ రాజధానిని కోరుకోవడం లేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. అమరావతిలో మాత్రం అక్కడ ప్రజలు రాజధానిని కొనసాగించాలని కోరుతున్నారన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రఘురామకృష్ణంరాజు చెప్పారు. చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకని రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు. చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తప్పవన్నారు. ఇప్పటికైనా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ పునరాలోచించుకోవాలని చెప్పారు. కొందరు భజన పరులు వివాదాస్పదమైన సలహాలు ఇస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
Next Story

