Fri Dec 05 2025 23:01:31 GMT+0000 (Coordinated Universal Time)
లెక్కల్లో తేడాలున్నాయన్న రాజుగారు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా లెక్కల్లో తేడాలున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మరణాల్లో దేశంలోనే ఏపీ అగ్ర స్థానంలో ఉందన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కరోనా కట్టడి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా లెక్కల్లో తేడాలున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మరణాల్లో దేశంలోనే ఏపీ అగ్ర స్థానంలో ఉందన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కరోనా కట్టడి [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా లెక్కల్లో తేడాలున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మరణాల్లో దేశంలోనే ఏపీ అగ్ర స్థానంలో ఉందన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల కరోనా కట్టడి అవుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని, కానీ ఇప్పుడు వాలంటీర్లు కూడా పూర్తిగా చేతులెత్తేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రికవరీ రేటు కూడా ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే అద్వాన్నంగా ఉందన్నారు. అమరావతి వచ్చిన తర్వాతనే వైసీపీకి మంచి జరిగిందన్నారు. అలాంటి అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అనడం సరికాదని రఘురామకృషణంరాజు తెలిపారు.
Next Story

