Fri Dec 05 2025 23:56:35 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వ ఖర్చుతో ఫిర్యాదులేంటి?
పార్టీ వ్యవహరాలకు ప్రభుత్వ ఖర్చు ఉపయోగించడమేంటని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. తనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపలు ప్రభుత్వ విమానంలో ఢిల్లీ వెళ్లడమేంటన్నారు. మెయిల్ [more]
పార్టీ వ్యవహరాలకు ప్రభుత్వ ఖర్చు ఉపయోగించడమేంటని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. తనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపలు ప్రభుత్వ విమానంలో ఢిల్లీ వెళ్లడమేంటన్నారు. మెయిల్ [more]

పార్టీ వ్యవహరాలకు ప్రభుత్వ ఖర్చు ఉపయోగించడమేంటని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. తనపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపలు ప్రభుత్వ విమానంలో ఢిల్లీ వెళ్లడమేంటన్నారు. మెయిల్ ద్వారా తనపై ఫిర్యాదులు చేసుకునే వీలున్నా, పార్టీ ఖర్చును కూడా ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్నారన్నారు. తాను ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్ కు విధేయుడనని చెప్పారు. పార్టీని, జగన్ ను తాను ఏనాడు ఒక్క మాట కూడా అనలేదన్నారు. తాను వాస్తవ విషయాలు చెబుతుంటే పార్టీ ఎందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చిందో అర్థం కావడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
Next Story

