Sun Mar 15 2026 05:55:47 GMT+0530 (India Standard Time)
నా మీద ఎందుకు..? ఆ పోరాటం ఏంటో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు మరో లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు మరో లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు మరో లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు ఏడుసార్లు వినతి పత్రం ఇచ్చారన్నారు. తనపై అనర్హత వేటు వేయకుంటే లోక్ సభ కార్యక్రమాలను స్థంభింప చేస్తామని విజయసాయిరెడ్డి బెదిరింపులు సరికావన్నారు. ఈ పోరాటమేదో ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం నిధుల విషయంలో పెట్టి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం ఉండేదని రఘురామ కృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు. తాను కూడా విజయసాయరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు లేఖ రాశానని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
Next Story

