Fri Dec 05 2025 17:40:38 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు రఘురామ ఎనిమిదో లేఖ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రాశారు. పేదలందరికీ తక్షణమే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రాశారు. పేదలందరికీ తక్షణమే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖ రాశారు. పేదలందరికీ తక్షణమే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన తన లేఖలో కోరారు. వైఎస్సార్ జగనన్న కాలనీలను సత్వరం పూర్తి చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. గత ఎన్నికలకు ముందు పేదలందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీతోనే పేదలు వైసీపీకి అండగా నిలిచారని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు అదనంగా ఖర్చు చేస్తామని జగన్ ఇచ్చిన హామీని కూడా రఘురామ కృష్ణంరాజు తన లేఖలో ప్రస్తావించారు.
Next Story

