Fri Dec 05 2025 19:07:20 GMT+0000 (Coordinated Universal Time)
స్పీకర్ కు ఫిర్యాదు చేసుకున్నా ఏం ఇబ్బంది లేదు
తనపై మరోసారి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ [more]
తనపై మరోసారి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ [more]

తనపై మరోసారి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ తాను హైకోర్టులో పిటీషన్ వేయడంతో వైసీపీ ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు మరోసారి రెడీ అవుతున్నారన్నారు. కానీ తాను పార్టీ నిబంధనలను అతిక్రమించలేదని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. బహుశ జగన్ తన ఎంపీలతో కలసి త్వరలో ఢిల్లీ వస్తారని ఆయన తెలిపారు. అయినా తనను ఏమీ చేయలేరని, తన ప్రాణాలకు జగన్ నుంచే ముప్పు ఉందని రఘురామ కృష్ణంరాజు మరోసారి ఆరోపించారు.
Next Story

