Thu Jan 29 2026 09:10:35 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల పోరాటం ఏపీలో చేయాలి
వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఈసారి వైఎస్ షర్మిలపై విమర్శలకు దిగారు. వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేయాలని [more]
వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఈసారి వైఎస్ షర్మిలపై విమర్శలకు దిగారు. వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేయాలని [more]

వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఈసారి వైఎస్ షర్మిలపై విమర్శలకు దిగారు. వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ సమస్యలున్నాయని ఆయన అన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారని, జగన్ మాత్రం వివేకా హత్యను పట్టించుకోవడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సీబీఐ విచారణకు ఆదేశించినా పురోగతి లేదని ఆయన అన్నారు.
Next Story

