Sat Dec 20 2025 07:47:13 GMT+0000 (Coordinated Universal Time)
నాపై సీబీఐ కేసు వెనక వారే
తనపై సీబీఐ కేసు నమోదు చేయడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. అవాస్తవాలతో సీబీఐ తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందన్నారు. తనపై సీబీఐ కేసు [more]
తనపై సీబీఐ కేసు నమోదు చేయడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. అవాస్తవాలతో సీబీఐ తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందన్నారు. తనపై సీబీఐ కేసు [more]

తనపై సీబీఐ కేసు నమోదు చేయడంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. అవాస్తవాలతో సీబీఐ తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందన్నారు. తనపై సీబీఐ కేసు నమోదు చేయడం వెనక వైసీపీ నేతల ఒత్తిడి ఉందని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఎస్బీఐ మేనేజర్, సీఎంవో కార్యాలయానికి జరిగిన ఫోన్ సంభాషణలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ అనేక కేసులు నమోదు చేసిన జగన్ మాత్రం విచారణకు హాజరు కావడం లేదన్నారు. తమ కంపెనీ ఎంత మాత్రం నిధులు దుర్వినియోగం చేయలేదని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.
Next Story

