Fri Jan 30 2026 13:06:37 GMT+0000 (Coordinated Universal Time)
రాజధానులపై పురంద్రీశ్వరి స్పందన
వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుందని బీజేపీ నేత పురంద్రీశ్వరి అన్నారు. జీఎన్ రావు కమిటీ బహిర్గతం చేయాలని పురంద్రీశ్వరి కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి భూములు [more]
వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుందని బీజేపీ నేత పురంద్రీశ్వరి అన్నారు. జీఎన్ రావు కమిటీ బహిర్గతం చేయాలని పురంద్రీశ్వరి కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి భూములు [more]

వికేంద్రీకరణను బీజేపీ సమర్థిస్తుందని బీజేపీ నేత పురంద్రీశ్వరి అన్నారు. జీఎన్ రావు కమిటీ బహిర్గతం చేయాలని పురంద్రీశ్వరి కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుని గ్రాఫిక్స్ తో కాలం గడిపేశారన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతులు 33 వేల ఎకరాల భూములను రాజధాని కోసం ఇస్తే వారికి ఇప్పుడు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని పురంద్రీశ్వరి కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అధికార వికేంద్రీకరణ జరగకూడదని పురంద్రీశ్వరి అభిప్రయాపడ్డారు.
Next Story

