Thu May 02 2024 19:35:50 GMT+0000 (Coordinated Universal Time)
ఇక అక్కడ రాష్ట్రపతి పాలన
జమ్మూ కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇవాళ అర్థరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. బీజేపీ-పీడీపీ ప్రభుత్వం రద్దయ్యాక ఆరునెలల పాటు గవర్నర్ పాలన విధించారు. ఆరునెలల గవర్నర్ పాలన ముగియడంతో రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story