Fri Dec 05 2025 16:51:09 GMT+0000 (Coordinated Universal Time)
ప్రశాంత్ రెడ్డి.. యమా లక్కీ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించిన వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితులగా [more]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించిన వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితులగా [more]

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించిన వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రిగా అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితులగా పేరున్న ఆయన 2014లో మొదటిసారి విజయం సాధించగా.. అప్పుడే నామినేటెడ్ పదవిని కేటాయించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ చేయడంతో వేముల ప్రశాంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి వచ్చేందుకు రూట్ క్లీయర్ అయ్యింది. ఆయనకు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
Next Story
