Sat Dec 06 2025 10:07:20 GMT+0000 (Coordinated Universal Time)
“పీకే”శారుగా
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను జనతాదళ్ యు సస్పెండ్ చేసింది. పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పార్టీ విధానానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న ప్రశాంత్ [more]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను జనతాదళ్ యు సస్పెండ్ చేసింది. పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పార్టీ విధానానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న ప్రశాంత్ [more]

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను జనతాదళ్ యు సస్పెండ్ చేసింది. పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించింది. పార్టీ విధానానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ను ఇక పార్టీలో ఉంచుకుని లాభం లేదని నిర్ణయించారు. సీఏఏ విషయంలో బీజేపీని వ్యతిరేకిస్తూ వరస కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్ననే ప్రశాంత్ కిషోర్ పై నితీష్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. అయితే బీహార్ వచ్చిన తర్వాత చూసుకుందామని పీకే సమాధానమిచ్చారు. కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ కిషోర్ ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ధన్యవాదాలంటూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.
Next Story

