బయటకు వచ్చి ముచ్చట్లు పెడితే ఇక అంతే?
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది . ప్రజలు ఎక్కడ కూడా గుమి కూడా వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు . ఇంట్లోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు [more]
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది . ప్రజలు ఎక్కడ కూడా గుమి కూడా వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు . ఇంట్లోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు [more]
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది . ప్రజలు ఎక్కడ కూడా గుమి కూడా వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు . ఇంట్లోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. ఎవరైనా బయటికి వస్తే వారి పైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రభుత్వాలు చెప్పిన మాటలను ప్రజలు పెడచెవిన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. అవసరం లేకపోయినా రోడ్ల మీదకు వస్తున్నారు . పోకిరి లు రోడ్లమీద చక్కర్లు కొడుతున్నారు. కాలనీల్లో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. దీనిని కట్టడి చేసేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న తరహాలో ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎక్కడైతే కాలనీలు, గల్లీలలో ఉంటున్నారో వాళ్ళ వివరాలు తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరా లను ప్రయోగిస్తున్నారు.
నిఘా పెట్టి…..
డ్రోన్ కెమెరాలను కాలనీల్లో తిప్పుతున్నారు. ఈ కెమెరా ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు . అవసరమైన పక్షంలో కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇలా రోడ్ల మీద గుమిగూడి ఉంటున్న వారి పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. బాల నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయోగించిన డ్రోన్ కెమెరా సంబంధించిన విజువల్స్ లో పబ్లిక్ కెమెరా చూడగానే పరుగులు పెడుతున్న డోన్ కెమెరాకు చిక్కాయి. డ్రోన్ కెమెరా విజువల్స్ అధికారులు అధికారికంగా మీడియాకు రిలీజ్ చేశారు. ఎక్కడైనా సరే పబ్లిక్ ఉన్నట్లు సమాచారం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు. పూర్తి ఆధారాలతో వారిని పట్టుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు . ఇప్పటికీ సైబరాబాద్ పరిధిలో మొత్తం 12 డ్రోన్ కెమెరా ల ద్వారా పబ్లిక్ ను సమీక్షిస్తామని కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.