Sun Feb 01 2026 21:53:04 GMT+0000 (Coordinated Universal Time)
పినరయి విజయన్ అభ్యంతరం.. ప్రధానికి లేఖ
కేరళ నుంచి వచ్చే వారిపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతరాష్ట్ర [more]
కేరళ నుంచి వచ్చే వారిపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతరాష్ట్ర [more]

కేరళ నుంచి వచ్చే వారిపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతరాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించకూడదన్న నిబంధనలు ఉన్నా కర్ణాటక ప్రభుత్వం దానిని లెక్క చేయడంలేదన్నారు. కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అక్కడి నుంచి కర్ణాటకకు వచ్చే వారు విధిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ను చూపించాల్సి ఉంటుందన్న నిబంధనను కర్ణాటక ప్రభుత్వం విధించింది. కేరళ కారణంగానే తమరాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై పినరయి విజయన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Next Story

