Sun Mar 15 2026 14:09:28 GMT+0530 (India Standard Time)
తప్పుడు ఆరోపణలు ఇప్పటికైనా మానుకోండి
తప్పుడు ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు అలవాటుగా మారిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందన్నారు. ఇప్పుడు ఇసుక కాంట్రాక్టును [more]
తప్పుడు ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు అలవాటుగా మారిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందన్నారు. ఇప్పుడు ఇసుక కాంట్రాక్టును [more]

తప్పుడు ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు అలవాటుగా మారిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందన్నారు. ఇప్పుడు ఇసుక కాంట్రాక్టును ప్రయివేటు సంస్థకు ఇవ్వడం వల్ల ప్రజలకు నష్టమేమీ జరగదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, లేకుంటే ఫిర్యాదు చేయవచ్చని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మరి టెండర్లు జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 120 కోట్లు డిపాజిట్ చేసిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.
Next Story

